కోనసీమ: పి.గన్నవరంలో నేడు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10:30 గంటలకు అంబాజీపేటలోని గంగలకుర్రు గ్రామ పంచాయతీ వద్ద రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేస్తారు. ఉదయం 11:30 గంటలకు అయినవిల్లిలో పోతుకుర్రు గ్రామ పంచాయతీ వద్ద పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు.