AP: తూ.గో జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం సంభవించగా.. భారీగా మంటలు వ్యాపించి ఔషధాల విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచర్, ఇతర పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు.