SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవితను బుధవారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు కూడా ఆమెను కలిసి తమ సమస్యలను విన్నవించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.