W.G: కాళ్ల మండలంలోని అనుమానిత ప్రాంతాల్లో నిన్న డ్రోన్లతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఏలూరుపాడు, సీసలి, కాళ్ల తదితర గ్రామాల్లో ఈగల్ బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.