TPT: తిరుపతి యూత్ హాస్టల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో-2026 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా సరైన కోర్సులను ఎంచుకోవాలని, పోటీ ప్రపంచంలో అవగాహన ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. ఎక్స్పోలో వివిధ విద్యా కోర్సులకు సంబంధించిన స్టాళ్లను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.