JN: చిల్పూర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం లారీ బైక్ను ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ వైపు బైక్పై వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గుగులోతు కమలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త గుగులోతు దాసుకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన దాసును 108 అంబులెన్స్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.