IPL-2025 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు జితేశ్ శర్మను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, వేలం తర్వాత పంజాబ్ యజమాని ప్రీతి జింటా తనకు ఫోన్ చేసి, బడ్జెట్ పరిమితుల వల్ల తనను తిరిగి కొనుగోలు చేయలేకపోయినందుకు ‘సారీ’ చెప్పిందని తాజాగా వెల్లడించాడు. ఒక ఫ్రాంఛైజీ ఓనర్ ఇలా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని జితేశ్ పేర్కొన్నాడు.