చెన్నై వేదికగా భారత్తో జరగనున్న మ్యాచ్ కోసం తాము సిద్ధంగా ఉన్నామని జింబాబ్వే కోచ్ జస్టిన్ సామన్స్ తెలిపాడు. వెస్టిండీస్ తమపై ఆడినట్లే, భారత్ కూడా ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడుతుందని తమకు తెలుసని కోచ్ పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పాడు. తమ పేసర్ ముజారబానీని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు.