మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు జూలైలో టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారేలో ఈ మ్యాచ్లు జరగనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే, 2027 జనవరిలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్కు జింబాబ్వే రానుంది. జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబైల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.