బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్లు మొదటి వన్డేలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్ విజయం తర్వాత హర్మన్ సేన తొలి వన్డే సిరీస్ ఆడుతోంది. 1983/84 మొదలు ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 11 వన్డే సిరీస్లు జరగ్గా.. భారత్ ఒక్కటి కూడా గెలవలేదు.