స్పిన్నర్ మయాంక్ మార్కండేపై మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL-2026 సీజన్లో మయాంక్ రాణిస్తే ముంబై ఇండియన్స్కు తిరుగుండదని అన్నాడు. గత కొన్ని సీజన్లుగా ముంబైకి స్పిన్ బౌలింగ్ బలహీనతగా మారిందని, మయాంక్ ఆ లోటును తీర్చితే ఆ జట్టుకు ఏ సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు. అలాగే దీపక్ చాహర్ కూడా సత్తా చాటితే ముంబై బౌలింగ్ మరింత భీకరంగా మారుతుందన్నాడు.