నాలుగు నెలలుగా భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూలుక్ తో కనిపించారు. తొలిసారి జాకెట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం దేశంలో చలి తీవ్రత పెరిగి.. ఉత్తరాదిలో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జమ్మూలోని కతువాలో రాహుల్ జాకెట్ ధరించి కనిపించారు. చలిగా ఎక్కువగా ఉన్నా సరే కేవలం టీ షర్ట్ మాత్రమే వేసుకొని జోడో యాత్రను కొనసాగించారు.
జాకెట్ వేసుకొని కొత్తగా కనిపించడంతో ఈరోజు రాహుల్ యాత్ర కన్నా ఆయన వేసుకున్న టీషర్ట్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. టీషర్ట్ ధర ఎక్కువని, టీషర్ట్ లోపల థర్మల్ ఉంచుకున్నారని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మీకు చలి అనిపించడం లేదా అని మీడియా ప్రతినిధులు అడిగితే.. ‘‘భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత.. ‘టీ షర్ట్ ధరించి చలిని ఎలా తట్టుకోవటం’ అనే వీడియో చేస్తా’’ అని రాహుల్ చమత్కరించారు. తనకు ఢిల్లీలో చలి పెద్దగా అనిపించడం లేదని, ఒకవేళ చలి అనిపిస్తే స్వెటర్ గురించి ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు.