NRPT: చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం నారాయణపేట పట్టణంలోని ఆలయాలను నిర్వాహకులు మూసివేశారు. గ్రహణం సమయం ముగిసిన అనంతరం ఆలయాలను తెరిచి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అశోక్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్వాహకులు మూసివేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయాల కమిటీ సభ్యులు తెలిపారు.