CTR: జిల్లాలో రైతులకు రూ. 115.81 కోట్ల లబ్ధి చేకూరింది. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాల్లో రూ. 6 వేలు జమ కానున్నాయి. అందులో రూ. 2 వేల చొప్పున రూ. 33.51 కోట్లు విడుదల కానున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 వేల చొప్పున 2,05,753 మంది రైతులకు రూ. 82.30 కోట్లు విడుదల చేయనుంది.
NLR: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ELR: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జేసీ అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటా రూ. 2,389, 75 కేజీలు రూ.1,792, 40 కేజీలు రూ.956, సాధారణ రకం ఒక క్వింటాలు రూ. 2,369, 75 కేజీలు రూ.1,777, 4కేజీలు రూ. 948 మద్దతు ధర కల్పించడం జరిగిందని తెలిపారు.
JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. పరీక్షలు మంచిగా రాసి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు విద్యార్థులకు సూచించారు.
VSP: వేపగుంట మండలం బంటాకాలనీ 92వ వార్డులోని దుర్గాదేవి, అభయాంజనేయస్వామి ఆలయాల వార్షికోత్సవాలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం దుర్గాదేవికి దర్శనాలు, ఆంజనేయస్వామికి సింధూరార్చన, తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశామన్నారు.
ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు కనీస జీతం రూ.లక్ష. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TPT: తిరుమలలో 66,606 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 25,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లు నిండగా, సర్వదర్శనానికి 12-15 గంటలు సమయం పడుతోందని పేర్కొన్నారు.
అన్నమయ్య: తంబళ్లపల్లి MPDO కార్యాలయంలో ఇవాళ జరిగే మండల సర్వసభ్య సమావేశానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులతో పాటు టీడీపీ నేతలకు అనుమతి ఇవ్వాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు టీడీపీ మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ఇతర నేతలకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన ఆమోదించారు.
GNTR: తెనాలిలో ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై యాజమాన్యాలు టార్గెట్లు విధిస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తికాకముందే అడ్మిషన్లు తీసుకురావాలని ఒత్తిడి పెడుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు ఆపడం, ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని టీచర్లు అంటున్నారు. దీంతో వారు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం కష్టపడుతున్నారు.
E.G: ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో జరుగుతున్న ACB సోదాలు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అర్ధరాత్రి వరకు ACB DSP కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నేడూ సోదాలు జరగనున్నాయి. ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్స్, పెండింగ్ అప్లికేషన్స్, అక్రమ కట్టడాలకు చెందిన నోటీసుల ఫైళ్లను పరిశీలిస్తుంది.
AKP: మహిళల సమస్యలపై రేపు విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘ మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఆర్ శైలజ పాల్గొని మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
AP: విజయవాడ భవానీపురంలో దర్గా ఉర్సు ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దర్గా ముజావర్ల కమిటీ ఉత్సవాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ను ఆహ్వానించింది. కమిటీ ఆహ్వానం మేరకు జగన్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్, చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు. అనంతరం భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్సై నిరంజన్ రెడ్డి బదిలీ కావడంతో బుధవారం స్థానిక నాయకులు ఆయనను సన్మానించారు. ఆయన సేవలను కొనియాడారు. పెద్దకడబూరులో విధులు నిర్వహించిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి శాంతిభద్రతల పరిరక్షణలో కృషి చేశారని టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి తెలిపారు.
GDWL: ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేసినప్పుడే ప్రజాపాలన లక్ష్యం నెరవేరుతుంది అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అనారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బృందావన్ గార్డెన్స్లో నిర్వహించే కౌన్సిలర్లు, సర్పంచ్ల శిక్షణ ఏర్పాట్లను బుధవారం రాత్రి కలెక్టర్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YCP)ని స్థాపించి 16 ఏళ్లు పూర్తై, 17వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా YCP అధినేత జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉ.9:30 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.