VSP: వేపగుంట మండలం బంటాకాలనీ 92వ వార్డులోని దుర్గాదేవి, అభయాంజనేయస్వామి ఆలయాల వార్షికోత్సవాలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం దుర్గాదేవికి దర్శనాలు, ఆంజనేయస్వామికి సింధూరార్చన, తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశామన్నారు.