SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంటల సేద్యానికి మూడో విడత సాగు నీటి పారుదల కొనసాగింది. కల్హేర్ మండలం ఇందిరానగర్ వరకు ఉన్న చివరి ఆయకట్టు దాక నీళ్లను పంటలకు అందించనున్నట్లు ప్రాజెక్ట్ AE శ్రీవర్ధన్ నేడు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1488 అడుగుల వద్ద నీటి లేవల్ ఉందని AE చెప్పారు.