KMM: కల్లంలో ఆరబోసిన మిర్చిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన కామేపల్లి మండలంలో కలకలం రేపింది. గరిడేపల్లికి చెందిన రైతు బానోత్ మత్రు తన మిరప పంటను కోసి, చేను వద్దే ఆరబోశాడు. బుధవారం తెల్లవారుజామున దుండగులు సుమారు 4 క్వింటాళ్ల మిర్చిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.80 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.