• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిప్పగిరిలో భోగలింగేశ్వర స్వామి కళ్యాణానికి ఎమ్మెల్యే విరాళం

KRNL: చిప్పగిరిలోని శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా అలూరు MLA విరుపాక్షి రూ. 50,000 విరాళాన్ని ఇవాళ అందజేశారు. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రబిందువులని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 11:09 AM IST

ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలి: MLA

ADB: గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలని అభివృద్ధి సాధించాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.

February 22, 2026 / 11:09 AM IST

అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: అమరావతి మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బంది అవుతోందనే ఉద్దేశంతో R-5 జోన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ జోన్‌లోని 900 ఎకరాల భూమిని తిరిగి CRDAకు అప్పగించనున్నారు. గతప్రభుత్వం అక్కడ వేసిన లేఅవుట్లు, భూ పంపిణీని CRDA రద్దు చేసింది. అయితే, అక్కడ స్థలాలు పొందిన లబ్ధిదారులకు ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.

February 22, 2026 / 11:07 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ASR: చింతూరు మండలం సింగనగూడెం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్‌కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 11:06 AM IST

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

February 22, 2026 / 11:05 AM IST

ఈ నెల 24న మినీ జాబ్ మేళా

మంచిర్యాల ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శృతి గోలిస్ బర్త్ రూట్ ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, హౌస్ కీపింగ్, ఫార్మసిస్ట్, సిస్టం ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 11:05 AM IST

నాలుగు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.

February 22, 2026 / 11:04 AM IST

రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:04 AM IST

సీసీ కెమెరాల నిఘాతో ఇంటర్మీడియట్ పరీక్షలు

CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.

February 22, 2026 / 11:04 AM IST

పట్టణ అభివృద్ధికి కృషి: MLA కందుల

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.

February 22, 2026 / 11:03 AM IST

‘గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.

February 22, 2026 / 11:02 AM IST

టార్గెట్ ఫిక్స్ అయింది .. ఇక పనుల జాతరే..!

NLG: జిల్లా కేంద్రం ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 7.44 లక్షల జాబ్ కార్డు ఉండగా ఇందుకోసం రూ.1.16 కోట్ల పని దినాలను అంచనా వేశారు. అవినీతిని అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 11:02 AM IST

నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

బుచ్చిలో హ్యాపీ సండే కార్యక్రమం

NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్‌లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్‌లు వేయగా మెప్మా ఆర్‌పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

‘పాత రుసుముల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలి’

E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఫీజులు తగ్గింపు అధికార పక్షం, ప్రతిపక్షం ఆమోదంతోనే జరిగిందన్నారు.

February 22, 2026 / 11:00 AM IST