యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YCP)ని స్థాపించి 16 ఏళ్లు పూర్తై, 17వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా YCP అధినేత జగన్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఉ.9:30 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.