HNK: నడికూడ ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో శేషాద్రి సందర్శించి కార్యాలయ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం ఈజిఎస్ సిబ్బందితో సమావేశమై ఉపాధి హామీ పనుల అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. తొలిసారిగా ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన సీఈవోను అధికారులు సన్మానించారు. ఎంపీడీవో రామకృష్ణ, MEO హనుమంతరావు, APO విద్యావతి ఉన్నారు.
WNP: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రగతి వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఆయన హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ‘ఇంటింటికి మీ మేయర్’ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను మేయర్ ఆదేశించారు.
ATP: జిల్లా SP జగదీష్ ఆదేశాల మేరకు అనంతపురం పోలీసు ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. కిమ్స్ సవేరా ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్యులు పరీక్షలు చేశారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో ఎస్పీ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయించారు.
TG: 2023లో ప్రజాపాలన ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2023లో తమ దగ్గర అధికార యాంత్రాంగం లేదు.. అవినీతి డబ్బు లేదన్నారు. తాము కమిట్మెంట్తో, మంచి చేయాలనే ఆలోచనలతో ప్రజల ముందుకు వచ్చాం కాబట్టే.. గెలిచామన్నారు. SC వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం జరిగిందని.. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడారన్నారు.
PLD: గురజాల మండలం గంగవరంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి 32వ వార్షికోత్సవ కళ్యాణ వేడుకలు ఈ నెల 8న వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఇదే క్రమంలో నూతనంగా నిర్మించిన దీక్షా భవనాన్ని ప్రారంభించనున్నారు. భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామ సమీపంలో వెలిసిన వెలుగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ అలివేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపారు.
ఏలూరు: ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు, పవరుపేటలోని గాంధీ నగర్ అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కోకో సాగు చేసే అన్ని జిల్లాల నుండి కోకో రైతుల సంఘం ప్రతినిధులు పాల్గొనవలసిందిగా కోరారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. దీంతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో నమోదైన 31 సిక్సర్ల రికార్డును ఈ మ్యాచ్ అధిగమించింది.
వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటితో పాటు పుచ్చకాయ జ్యూస్, మామిడి జ్యూస్, నిమ్మరసం, మజ్జిగ, నారింజ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
NTR: తిరువూరు మండలం కాకర్ల పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం అడవి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతుడిది టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లాది కిషోర్ (20) గా స్థానికులు శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: అటవీ శాఖకు చెందిన భూముల్లో జీడి తోటలు సాగు చేస్తున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని కోటవురట్ల మండలం అణుకు గ్రామానికి చెందిన గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం చౌడువాడ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అలాగే, జీడీ పిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర ప్రకటించాలని, వాటిని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు.
SDPT: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 18 వేల ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 10న హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ టీవీఏసి జెఎసి నాయకులు గౌటే భాస్కర్ పిలుపునిచ్చారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ సబ్ స్టేషన్లో మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
VSP: జీవీఎంసీ 13వ వార్డు ఆరిలోవలో శానిటేషన్ వర్కర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి, మహిళల కోఆర్డినేటర్ ఎం. నాగలక్ష్మి పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల నైపుణ్యాల పెంపు, తడి-పొడి చెత్త వేరు చేయడం, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించారు.
SKLM: పలాస మండలం మామిడిపల్లిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు కోరారు. ఈమేరకు పలాసలోని సూదికొండలో శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొన్నారు.