నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ‘ఇంటింటికి మీ మేయర్’ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను మేయర్ ఆదేశించారు.