WNP: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రగతి వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఆయన హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.