• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో ఇంధన కొరత లేదు

CTR: హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలాంటి సమస్య ఎక్కడా లేదని పలువురు బంకు ఓనర్లు పేర్కొన్నారు. జిల్లాలో 60 రోజులకు పైగా సరిపడా నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా డీజిల్ సరఫరా లేటు, బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో సమస్యలు ఉన్నాయన్నారు.

March 25, 2026 / 01:37 PM IST

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి భరోసా

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి సవితను పలువురు కూటమి నాయకులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సందర్శకులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను మంత్రికి విన్నవిస్తూ వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటి పరిష్కారానికి తగిన కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

March 25, 2026 / 01:37 PM IST

ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి

AKP: నర్సీపట్నంలోని ట్రాక్టర్ షోరూమ్‌లో జరిగిన ప్రమాదంలో ఈదల అశోక్ తేజ అనే యువకుడు మృతి చెందాడు. మెకానిక్‌గా పనిచేస్తూ ట్రాక్టర్ కింద ఉండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా, గేర్లో ఉన్న వాహనం కదలడంతో వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించినట్లు పోలీసులు తెలిపారు.

March 25, 2026 / 01:35 PM IST

ఆక్రమణలపై నెల్లూరు కమిషనర్ సీరియస్

నెల్లూరు సిటీ 8వ డివిజన్ హిమాలయ స్కూల్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ వైవో. నందన్ బుధవారం పర్య టించారు. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఆక్రమణకు గురైన డ్రైనేజీ కాలువను టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణల తొలగింపుపై తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వేయర్, ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

March 25, 2026 / 01:35 PM IST

పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

AP: పర్యాటక శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటకశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన పర్యాటక ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా, శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

March 25, 2026 / 01:35 PM IST

ఆదిత్యని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్త సి.డి.శేఖర్ బుధవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

March 25, 2026 / 01:35 PM IST

కంపు కొడుతున్న మురుగునీటి కాలువలు

VZM: బొబ్బిలి పట్టణంలోని మురుగునీటి కాలువలు కంపు కొడుతున్నాయి. కాలువలలో పూడికలు పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో కాలువలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జంగాల శివాలయం వీధి సమీపంలోని కాలువలు కంపు కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛ బొబ్బిలిని చెత్త బొబ్బిలిగా మారుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 25, 2026 / 01:33 PM IST

సెట్విన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సతీమణి

NRPT: మక్తల్ పట్టణంలో సెట్విన్ సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీహరి సతీమణి లలిత ఈరోజు సందర్శించారు. కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందుతున్న మహిళలకు స్టడీ మెటీరియల్‌ను వారికి అందజేశారు. కుట్టు మిషన్‌లో శిక్షణ పొందుతున్న యువతులకు మెలకువలను నేర్పించారు. శిక్షణ పొందుతున్న వారి దగ్గరికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

March 25, 2026 / 01:33 PM IST

ఇరుగుళంలో ఉచిత వైద్య శిబిరం

TPT: శ్రీ సిటీ పరిధిలోని ఇరుగుళం గ్రామంలో ఎస్సై ప్రియాంక ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు, చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచుతాయని తెలిపారు.

March 25, 2026 / 01:32 PM IST

మియాపూర్‌లో రామప్రభు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు

RR: మియాపూర్ 240 డివిజన్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను ఎమ్మెల్యే గాంధీ ఈరోజు ప్రారంభించారు. పేద ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

March 25, 2026 / 01:32 PM IST

ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆత్రం సుగుణ పరామర్శ

ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని ఉస్మానియా మజీద్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ బాధిత కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఉపాధ్యాయుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

March 25, 2026 / 01:31 PM IST

న్యాయవాదులను కలిసిన స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు

SRCL: వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులను స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్ కుమార్ కలిసి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల వృత్తి అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం కోసం బార్ కౌన్సిల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు తన గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

March 25, 2026 / 01:30 PM IST

శబరిమల సేవలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దంపతులు

JGL: కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ధర్మపురి BRS పార్టీ ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందారు. వారు మాట్లాడుతూ.. స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నారు.

March 25, 2026 / 01:30 PM IST

ఇద్దరు అటవీ అధికారుల సస్పెండ్

MNCL: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎన్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

March 25, 2026 / 01:30 PM IST

పశువులకు ఉచిత టీకాల కార్యక్రమం

KNR: ఇల్లందకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ చింతం శ్రీలత ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా సుమారు 255 పశువులకు టీకాలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

March 25, 2026 / 01:30 PM IST