ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని ఉస్మానియా మజీద్ నగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ బాధిత కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. ఉపాధ్యాయుడి భౌతిక దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.