HYD: నగరంలో కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పిల్లలు ఇష్టంగా తినే బేకరీ పదార్థాలను విషంతో తయారు చేస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. HYD శివారు మేడిపల్లి పోలీసులు నిన్న చెంగిచర్ల X రోడ్లోని విల్లా బేకరీపై దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సింథటిక్ రంగులు, పైనాపిల్, వెనిల్లా, ఆరెంజ్ ఫ్లేవర్లతో కేకుల తయారీని గుర్తించారు.
HYD: నగరంలో కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పిల్లలు ఇష్టంగా తినే బేకరీ పదార్థాలను కల్తీ సామాగ్రితో తయారు చేస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. HYD శివారు మేడిపల్లి పోలీసులు నిన్న చెంగిచర్ల X రోడ్లోని విల్లా బేకరీపై దాడి చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సింథటిక్ రంగులు, పైనాపిల్, వెనిల్లా, ఆరెంజ్ ఫ్లేవర్లతో కేకుల తయారీని గుర్తించారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ మూవీపై క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ చేయనున్న స్పెషల్ సాంగ్ కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్లతో వేర్వేరుగా కంపోజ్ చేయిస్తున్నారట. అందులో ఏది ఉత్తమంగా ఉంటే దానినే ఫైనల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ చరణ్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్లా ఉండనుందట.
SKLM: శ్రీకాకుళం మండలం అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జి రెడ్డి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆయన నామ గోత్రాలను చదివి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి జ్ఞాపకను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో కేఎన్వీడీవీ.ప్రసాద్ పాల్గొన్నారు.
KMM: తల్లాడ మండలం కుర్నవల్లి వద్ద అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తల్లాడ తహశీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 59.94 టన్నుల ఇసుక ఒక క్యూబిక్ మీటరుకు రూ. 642గా ధర నిర్ణయించారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ.25,000 ధరావత్తు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది అని తాహశీల్దార్ తెలిపారు.
VSP: లంకెలపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వాటర్ ఫ్రంట్ పార్క్’ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాలమైన నడక దారి (Walking Track), చిన్నారుల కోసం ఆటస్థలాలు, ఓపెన్ జిమ్, పచ్చని గార్డెన్తో ఈ పార్క్ రూపుదిద్దుకుంది. సాయంత్రం వేళల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇది సరైన వేదికగా మారింది.
AP: ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలిపారు. ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజా సేవలో అంకితభావంతో పనిచేసి, ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది మోదీ పట్టుదల, సంకల్పానికి నిదర్శనం. దేశ సేవలో ప్రధానికి శక్తి, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
ADB: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సోమవారం ఘన్ పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్వహించిన నిరసనలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని “బకాయిలు చెల్లించు” అనే ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఫీ రియంబర్స్మెంట్ చెల్లించి విద్యార్థుల భవిష్యత్తులను కాపాడలన్నారు.
NDL: అహోబిలం మాలోలా గెస్ట్ హౌస్ మేనేజర్ బద్రి నారాయణకు ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తాను నిర్వహించిన సాంస్కృతిక సేవలను గుర్తించి ఈ గౌరవం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కూడా వెల్లడించారు.
HYD: వేసవి దృష్ట్యా నగరంలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.
KMM: ఏన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ నెల 29న దివ్యాంగుల కోసం భారీ ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఆదివారం పాఠశాలను సందర్శించిన పూర్వ విద్యార్థులు, ఈ కార్యక్రమ పోస్టర్లను ప్రిన్సిపల్తో కలిసి విడుదల చేశారు. శారీరక సమస్యలు, వైకల్యంతో బాధపడే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
WGL: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో నల్లబెల్లి మండల బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సరి కాదని మండల అధ్యక్షుడు తడక వినయ్ అన్నారు. హామీలను ప్రశ్నించే సమయంలో అరెస్టులు సరికాదన్నారు. సీఎం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు, కుమారస్వామి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక ఐటీసీ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించారు. 13వ వేతన ఒప్పందం పెండింగ్ అంశాలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం జేఏసీతోనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
PPM: జీడి తోటల పునరుద్ధరణతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం గుమ్మలక్ష్మీపురంలో జీడి రైతులకు కొమ్మల కత్తిరింపు సామగ్రిని ఉచితంగా అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. 5 సంవత్సరాలు దాటిన తోటల్లో కొమ్మలు కత్తిరిస్తే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో జీడి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
MDCL: అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో అల్వాల్లో పోలీసులు బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమైన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చింతల మాణిక్ రెడ్డి, మోయి సుజాత, మల్లికార్జున గౌడ్, మురళీకృష్ణ, అజయ్ రెడ్డి, ఉదయ్, గోపి, పద్మిని, అజిత్ ఉన్నారు.