TPT: TTD ఈవో జే. శ్యామల రావు సోమవారం అన్నదాన సత్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నం రుచిగా ఉందా అంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదాన సత్రంలో స్వయంగా భోజనం చేసి రుచి చూశారు. నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.