VZM: నామినేటెడ్ పదవుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసినాయుడు సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మూడో విడతలో ప్రభుత్వం ఇవ్వనున్న నామినేటెడ్ పదవుల్లో మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాసినట్లు తెలిపారు.
W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. 8న 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. అలాగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
NLR: అల్లూరు పట్టణంలోని శ్రీ పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన అధికారులు సోమవారం చేపట్టారు. దాదాపుగా ఎనిమిది నెలలకు గాను రూ.4,69,840 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్, ఆలయ కార్య నిర్వహణ అధికారి, దేవస్థాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
CTR: కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ట దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడటం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో? తెలుస్తోందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
BDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకు, రైతులకు ఏమాత్రం ఉపయోగం లేదని కేవలం కార్పొరేట్ వర్గాల వారికి మాత్రమే ఉపయోగపడుతుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శరత్ బాబు అన్నారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు.
PDPL: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును ఫిబ్రవరి 4 వరకు పొడిగించడంపై కళాశాల కో-ఆర్డినేటర్ అబ్దుల్ షుకూర్ వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం కళాశాలలోని వర్సిటీ అభ్యాసకుల సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
ములుగు: ఆజామ్ జాహీ మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో సోమవారం ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
హనుమకొండ: దామెర మండలంలోని పులుకుర్తి గ్రామంలో బాల మానసాదేవి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేడు భూమి పూజ నిర్వహించారు. గ్రామస్తులు ఐకమత్యంగా ఉంటూ మానస దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారాయితోపాటు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
CTR: ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యదాయకమని IB PRP భువనేశ్వరి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం అవరణంలో రైతు సాధికార సంస్థ వారిచే ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో హానికర క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అన్నారు.
CTR: ఎస్ఆర్ పురం ఘటనలో మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
CTR: పుంగనూరులో మంగళవారం జరిగే రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం ప్రారంభమవుతుందని చెప్పారు. వాహన సేవలలో భక్తులు పాల్గొనాలని కోరారు.
TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఒక ఏడాదిపాటు గ్రాడ్యుయేట్/ డిప్లొమా అప్రెంటిస్ షిప్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. గ్రాడ్యు యేట్-19, డిప్లమా- 7 మొత్తం 27 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా వెల్లడించింది.
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. తాజాగా ఈఏపీసెట్ షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈనెల 22 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగనుంది.
‘గ్రామీ అవార్డ్స్ 2025’ వేడుకలో అమెరికన్ ర్యాప్ సింగర్ జంట రచ్చ చేసింది. ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా సెన్సోరి.. తాను వేసుకున్న నల్లటి కోటు విప్పేసి ట్రాన్స్పరెంట్ దుస్తులతో నగ్నంగా ఫొటోలకు ఫోజు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. వేడుకలో ఆమె ప్రవర్తించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. కాగా, కాన్యే గ్రామీ అవార్డ్స్లో రెండు విభాగాల్లో నామినేట్ అయ్యాడు.
BDK: వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో నాటు సారా కాస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో భాగంగా 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై కే.తిరుపతిరావు తెలిపారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.