CTR: ఎస్ఆర్ పురం ఘటనలో మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వ విప్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. మృతి చెందిన వెంకటేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.