KMM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అయన పాల్గోని మాట్లాడారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురాలేదని, దీనికి బీజేపీ ఎంపీలు సిగ్గుపడాలన్నారు.
KMM: మధిర నియోజకవర్గ నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ సభ్యులు సోమవారం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకి ఇంతటి చక్కని అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇంగ్లండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సహచరులపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని తెలిపాడు. ఫీల్డింగ్ విషయంలో వరుణ్ చక్రవర్తి చొరవ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.
KNRL: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో వసంత పంచమిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనానికి వివిధ ఫలాలతో పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. అనంతరం బృందావనానికి పూలు బంగారు కవచాలు పట్టు వస్త్రాలతో అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.
KNRL: దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో యురేనియం తవ్వకాల వల్ల వాతావరణం కలుషితమయ్యే ప్రమాదం ఉందని మానవహక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు VS.కృష్ణ, కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. ఈ రోజు కప్పట్రాళ్లలోని గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. నీరు, గాలి కలుషితమవటం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.
గోంగూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C, A, B6, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంతోపాటు ఎముకలను ధృఢంగా ఉంచుతాయి. హైబీపీ, ఆయాసం, దగ్గు, కళ్ల సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా గోంగూర తినడం వల్ల రక్త హీనత, మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆ పాత్రకు సంబంధించిన లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి TDP కైవసమైంది. మున్సిపల్ ఛైర్మన్గా TDP అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు రాగా YCP అభ్యర్థి లక్ష్మీకి 14 ఓట్లు వచ్చాయి. రమేష్ను MLA నందమూరి బాలకృష్ణ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు.
కడప: జిల్లాలోని ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానం నందు సోమవారం హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డులతో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అభినందనీయమని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు.
HYD: రోడ్డు ప్రమాదంలో MLA గన్మెన్ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం శంకర్పల్లి మండలం బుల్కాపూర్కు చెందిన శ్రీనివాస్(34) ఆదివారం బీరప్ప జాతరకెళ్లాడు. జాతర ముగించుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. కొండకల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ చేవెళ్ల MLA కాలే యాదయ్య వద్ద గన్మెన్గా పని చేస్తున్నాడు.
సత్యసాయి: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్కు అనుకూలంగా 23 ఓట్లు, వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఎన్నికల అధికారి రమేష్ గెలిచినట్లు ప్రకటించారు.
ELR: నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నియామకం వివాదంలో పడింది. గతంలో పనిచేసిన వ్యక్తికి ఈ పోస్టు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ పోస్టు అతనికి ఇవ్వొద్దంటూ ఇటీవల కొందరు నూజివీడు సబ్ కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
VZM: గరివిడి శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు సోమవారం నిరవధిక దీక్ష చేపట్టారు. స్టైఫండ్ వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని దీక్షకు దిగారు. మెడికల్ విద్యార్థులకు ఇచ్చే సౌకర్యాలు పశువైద్య విద్యార్థులకు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.
CTR: మాజీ మంత్రి పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారు పేటలో జరిగిన బోయకొండ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేష్ మేనకోడలి వివాహ వేడుకల్లో సోమవారం పెద్దిరెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట చిత్తూరు మాజీ MP రెడ్డప్ప, పలమనేరు మాజీ MLA వెంకటే గౌడ్ తదితరులు ఉన్నారు.
CTR: బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ చిరంజీవి, గంగవరం మండలానికి చెందిన టిప్పర్ డ్రైవర్ శ్రీనివాసులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.