HYD: రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వెల్లడించింది. గంటకు 41-61 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో 11,870 ఇంటి పన్నుల అసెస్మెంట్లు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5.50 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు రాబట్టారు. బకాయిల్లో సుమారు 50% వసూలు జరిగిందని, మార్చి 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. పన్ను చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమణ బాబు హెచ్చరికలు జారీచేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, తాజాగా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గాయపడటంతో షూటింగ్కు బ్రేక్ పడింది. ఈ కారణంగా సినిమా అనుకున్న సమయానికి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో మూవీ వాయిదా పడుతుందా అనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.
NTR: తిరువూరులో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని నాలుగు బంకుల్లో మూడు ఫ్యూయల్ లేక మూతపడ్డాయి. ఒక్క రిలయన్స్ బంక్లో మాత్రమే స్టాక్ ఉండడంతో ఆ బంక్ వద్ద భారీ క్యూ కనిపిస్తోంది. బంకులు మూసేస్తారన్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. క్రెడిట్ నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
KMR: కామారెడ్డిలోని గురుకుల గిరిజన బాలుర పాఠశాలలో విద్యార్థికి పాముకాటు సంఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ ఆమర్నాథ్ సింగ్ స్పందించారు. ప్రస్తుతం విద్యార్థి బానోత్ చరణ్ ఆరోగ్యం నిలకడగాఉందని, భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ బి. సిసంక్షేమ సంఘం అధ్యక్షుడు మంగలి ఎల్లయ్య, వర్కింగ్ అధ్యక్షులు నాగేంద్రవరప్రసాద్ కో ఆర్డినేటర్ నరేందర్ ఉన్నారు.
MDK: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది గ్రంథాలయ పరిసరాలను శుభ్రం చేస్తూ చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
NRPT: ధన్వాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తైబజార్ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో జట్ల గోవర్ధన్ గౌడ్ రూ.5.12 లక్షలకు పాటను దక్కించుకున్నారని కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆదాయం గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని సర్పంచ్ జ్యోతి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట పట్టణంలోని 5వ వార్డు శివ సంజీవయ్య కాలనీతో పాటు 6, 7వ వార్డులలోని SRKT కాలనీలలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు బుధవారం పర్యటించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాతో కలిసి కాలనీల్లో తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
JGL: వెల్గటూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు. సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు.
GDWL: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉద్యోగాల భర్తీ కోరుతూ ఈనెల 30న గద్వాల పాత బస్టాండ్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పోరు దీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్ను బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు బుధవారం విడుదల చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇళ్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పెట్రోలియం చట్టం-1934 ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. డబ్బాల్లో నిల్వచేస్తూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. తొలిసారి పట్టుబడితే రూ. 1000, నెల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 5వేలు, 3 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు. ప్రమాదాలు జరిగితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదవుతాయన్నారు.
NRML: మామడ మండలం పరిమండల్ మండల పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు గురుకుల ప్రవేశ ఫలితాల్లో ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలకు చెందిన లౌహిక, ప్రావిణ్య, శ్రీనీథ్లు గురుకుల పాఠశాలలో సీటు సాధించడంతో బుధవారం ఉపాధ్యాయులు వీరిని అభినందించారు. తోటి విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని చదువులో రాణించాలన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిన్న విడుదలైన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఈ సంవత్సరం పరీక్షలకు హాజరైన 25 మంది విద్యార్థులకు గాను 25 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాకూబ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
ASF: తెలంగాణ వైద్య విధాన పరిషత్ బిల్లుపై సిర్పూర్ MLA హరీష్ బాబు అసెంబ్లీలో బుధవారం ప్రసంగించారు. TVVPని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ప్రభుత్వాన్ని MLA అభినందించారు. దీని ద్వారా ఉద్యోగులకు జీతాలు, అలవెన్సెస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. జిల్లా ఆసుపత్రుల్లో MRI, సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ ఏర్పాటు చేయాలని కోరారు.
BDK: వాహనదారులకు రోడ్డు నిబంధనలపై ఆశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు రెడ్డి, ఎస్సై యయాతి రాజు అవగాహన కల్పించారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్- ఫేజ్ 2’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.