• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

MDK: తీవ్ర మనస్తాపానికి గురై వడ్ల మమత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. రాయపోల్ మండలానికి చెందిన నరసింహా చారితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాని భర్త వరకట్న వేధింపుల కారణంగా మమత కొంతకాంగా అమ్మగారి ఊర్లో ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

March 25, 2026 / 03:24 PM IST

గాలి గోపురానికి శంకుస్థాపన

NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పడమర గాలి గోపురం నిర్మించనున్నారు. ఇందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ముందుగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

March 25, 2026 / 03:23 PM IST

మహిళా కోటాలో ఓబీసీ మహిళకు సబ్ కోటా ఇవ్వాలి: కవిత

NZB: చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత కోసం జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ లను ఎంత ముఖ్యమో ఆకోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదనిట్వీట్ చేశారు.

March 25, 2026 / 03:22 PM IST

రేవంత్.. దమ్ముంటే నాపై పోటీ చేయు: హరీష్

TG: రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని.. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. వాళ్లు వీళ్లు ఎందుకు..? రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీకీ రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.

March 25, 2026 / 03:21 PM IST

జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

BPT: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఎస్సై సిబ్బందితో కలిసి బుధవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5,180 నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

March 25, 2026 / 03:20 PM IST

మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

JN: మంత్రి సీతక్కను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ సమస్యలను మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వివరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తావించిన ఆంశంపై మంత్రి సానుకులంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 25, 2026 / 03:20 PM IST

‘ప్రజలకు 108 సేవలు అందుబాటులో ఉండాలి’

BDK: ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు 108 సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ దానోజుల మనోహర్ అన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలోని 108 అంబులెన్స్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్ ఆదేశాల మేరకు వాహనంలోని వైద్య పరికరాలు, మందుల నిల్వలు ఆయన పరిశీలించారు.

March 25, 2026 / 03:19 PM IST

జనగణనపై అపోహలు వద్దు: DRO మాలోల

ATP: జనాభా లెక్కల సేకరణపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి మాలోల సూచించారు. అనంతపురం శ్రీనివాస్‌ నగర్‌లో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇళ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల కోసమే ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.  ప్రజలు అధికారులకు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు.

March 25, 2026 / 03:18 PM IST

కోహ్లీ రికార్డు బ్రేక్ అవుతుందా..?

IPL చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. 2016లో కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఏ ఇతర ఆటగాడు కూడా ఈ రికార్డుకు దరిదాపుల్లోకి రాలేకపోయాడు. మరి ఈ సీజన్‌లోనైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.

March 25, 2026 / 03:18 PM IST

నూతన తహసీల్దార్‌గా శ్రీనివాసరెడ్డి

KDP: కమలాపురం నూతన తహసీల్దార్‌గా పామిలేటి శ్రీనివాస రెడ్డి బుధవారం ఉదయం తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు రెవెన్యూ పరంగా తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను కలవచ్చని తెలిపారు.

March 25, 2026 / 03:16 PM IST

గ్రోయిన్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన

AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం వద్ద పెనుగొల్లు గ్రోయిన్ పునర్నిర్మాణ పనులకు ఎంపీపీ వెంకటలక్ష్మి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత రూ.99 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులు పూర్తయితే 1,200 ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు.

March 25, 2026 / 03:14 PM IST

త్వరలో ఆరోగ్య కేంద్రాల్లో HPV వ్యాక్సినేషన్

MDCL: బోడుప్పల్, నారపల్లి, ఘట్‌కేసర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో HPV వ్యాక్సినేషన్ అందుబాటులోకి రానున్నట్లుగా డాక్టర్ సౌందర్యలత తెలిపారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ రాకుండా నిరోధించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం HPV వాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆమె తెలిపారు.

March 25, 2026 / 03:14 PM IST

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి: కలెక్టర్

GDWL: నమూనా ఐక్యరాజ్య సమితి (మోడల్ యూఎన్) సర్వసభ్య సమావేశాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 సభ్య దేశాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇది ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

March 25, 2026 / 03:14 PM IST

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: చల్లపల్లి మండలం కొత్తమాజేరు పల్లెపాలెంలో బుధవారం నూతన కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఎంపీ లాడ్స్ నిధులు రూ.30 లక్షలతో ఈ భవనం నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. మండలి వెంకట్రామ్, తోట కనకదుర్గ, విమల్ కృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.

March 25, 2026 / 03:13 PM IST

నెట్వర్క్‌లు ప్రారంభించాలని వినతి

ASR: డుంబ్రిగుడ మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లకు ఇంకా నెట్‌వర్క్ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకుడు వంతాల గురు నాయుడు అన్నారు. ఈ సమస్యపై బిఎస్ఎన్ఎల్ అధికారులకు వినతిపత్రం బుధవారం అందజేశారు. ఫైబర్ కేబుల్ తెగిపోవడం వల్ల ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు.

March 25, 2026 / 03:13 PM IST