• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుంటుపల్లిలో రైతన్నా మీకోసం కార్యక్రమం

NTR: రైతులు వైవిధ్య పంటల సాగుతో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేసి అధిక దిగుబడి, నికరాదాయం పొందాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సూచించారు. గుంటుపల్లిలో రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లలో నీరు ఉన్న నేపథ్యంలో మే 15 నుంచి ముందస్తు సాగు మొదలు పెట్టాలని కోరారు.

March 25, 2026 / 07:07 PM IST

గ్యాస్ వాడే వారికి రూ.2400 సబ్సిడీ

AP: PNG వాడకాన్ని పెంచేందుకు ఏడాదికి రూ.2400 సబ్సిడీ ఇచ్చేలా DBT పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. LPGపై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నామని, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనుమతులను సరళం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 10 వేల PNG కనెక్షన్‌లు లక్ష్యంగా పెట్టుకున్నామని, వాణిజ్య, పరిశ్రమలకు విస్తరిస్తామన్నారు.

March 25, 2026 / 07:06 PM IST

‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి’

JGL: జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధ్యక్షతన విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. జిల్లాలో 575 బాధిత కుటుంబాలకు రూ.4.52 కోట్ల సాయం మంజూరు చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 192 కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేసి అందిస్తామన్నారు.

March 25, 2026 / 07:06 PM IST

గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ సమీక్ష

VZM: జిల్లాలో గృహల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ముఖ్యంగా లేఅవుట్లపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులను చైతన్య పరిచి అసంతృప్తిగా ఉన్న సుమారు 17,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించేందుకు కృషి చేయాలని చెప్పారు. లబ్ధిదారులతో ప్రతి శనివారం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

March 25, 2026 / 07:05 PM IST

గ్యాస్ సిలిండర్‌కు తాళం.. ఇబ్బందుల్లో ప్రజలు..!

KDP: సింహాద్రిపురంలో ఓ ఇంటి ముందర గ్యాస్ సిలిండర్‌కు వినియోగదారుడు గొలుసు తాళం వేశాడు. గ్యాస్ సిలిండర్లు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం సింహాద్రిపురానికి గ్యాస్ సరఫరా అయ్యేది. పది రోజులుగా సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియక గేటుకు సిలిండర్ను కట్టేసి ఉంచారు.

March 25, 2026 / 07:05 PM IST

ముగిసిన మన్యంకొండ హుండీ లెక్కింపు

MBNR: మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.44,90,043 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, ఇన్‌స్పెక్టర్ వీణా ధరణి, అలహరి రామకృష్ణ, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

వీధి కుక్కల బీభత్సం.. మేక పిల్లలు బలి

SDPT: వర్గల్ మండలం వేలూరు గ్రామంలో కుక్కల దాడిలో 23 మేక పిల్లలు మృతి చెందాయి. బుధవారం రైతులు మల్లేశం, కృష్ణ మేకలను మేతకు తీసుకెళ్లి, పిల్లలను దొడ్డిలోనే ఉంచారు. ఈ క్రమంలో వీధి కుక్కలు మేకల దొడ్డిలో దూరి పిల్లలను చంపేశాయి. సాయంత్రం వచ్చి చూసేసరికి మూగజీవాలు రక్తపు మడుగులో ఉండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

March 25, 2026 / 07:04 PM IST

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

NGKL: జిల్లాలోని అర్హులైన రైతులందరికీ పంట రుణాలను విరివిగా అందించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో బ్యాంకుల అనుసంధానంతో అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రాధాన్య పథకాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి చేయాలన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి’

BDK: బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ బుధవారం సారపాక ప్రధాన రహదారి వెంబడి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిషోర్ నాయక్‌తో పాటు ఉప సర్పంచ్ కన్నదారి, రమేష్ ఈవో మహేష్, వార్డ్ మెంబర్ మువ్వా వెంకటేశ్వర్లు పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

March 25, 2026 / 07:04 PM IST

‘కేంద్ర పథకాల ద్వారా మహిళలకు ఆసరా’

KKD: దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. మహిళల భద్రత, ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు.

March 25, 2026 / 07:03 PM IST

ఏప్రిల్ 2న గ్రామసభలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

PDPL: ఏప్రిల్ 2న జరగనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామాల్లో 4 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం 100 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధం చేయాలని, పన్ను వసూళ్లు 100%కి చేరుకోవాలన్నారు.

March 25, 2026 / 07:03 PM IST

రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ క్లారిటీ

రామ్ చరణ్ షూటింగ్‌లో గాయపడ్డారనే వార్తలపై ‘పెద్ది’ చిత్ర బృందం స్పందించింది. షూటింగ్ సమయంలో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, వెంటనే ఆయన వైద్య చికిత్స తీసుకున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రేపటి నుంచే షూటింగ్‌లో పాల్గొంటారని స్పష్టం చేసింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

March 25, 2026 / 07:02 PM IST

భద్రాద్రి రామయ్యకి మండపేట బొండాలు

కోనసీమ: భద్రాద్రి రాములోరి దివ్య కళ్యాణ మహోత్సవానికి మండపేట నుంచి కళ్యాణం కొబ్బరి బొండాలు తరలి వెళ్లనున్నాయి. మండపేట కు చెందిన కాజులూరి వెంకట అచ్యుత రామ రెడ్డి మహాలక్ష్మి దంపతులు ఈ కొబ్బరి బొండాలు భద్రాచలం వెళ్ళి స్వామి వారికి సమర్పిస్తారు. 26 ఏళ్లు నుండి ప్రతి శ్రీ రామ నవమి నాడు స్వామి వారి కళ్యాణం‌కు ఇక్కడ నుండి బొండాలు తీసుకు వెళ్ళి ఇస్తారు.

March 25, 2026 / 07:02 PM IST

ప్రధాని మోదీని కలిసిన ఎంపీ

E.G: రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి తన భర్త డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు బుధవారం ప్రధానమంత్రి మోడీని కలిశారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశ తరఫున మాట్లాడిన అంశాలను మోదీకి తెలిపారు. రచించిన “The Glimpses of World History” అనే పుస్తకాన్ని మోదీకి అందజేశారు. ప్రపంచ చరిత్రపై గ్రంథాన్ని రచించినందుకు ప్రధాని అభినందించారు.

March 25, 2026 / 07:02 PM IST

23 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాం: మంత్రి

KMM: ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసి పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని అసెంబ్లీలో నేడు ప్రకటించారు. ఇందుకుగాను రూ.738 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

March 25, 2026 / 07:00 PM IST