ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా ఇబ్బంది, అసౌకర్యం కలిగితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.
MDK: తీవ్ర మనస్తాపానికి గురై వడ్ల మమత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలం డీ ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. రాయపోల్ మండలానికి చెందిన నరసింహచారితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. కాని భర్త వరకట్న వేధింపుల కారణంగా మమత కొంతకాంగా అమ్మగారి ఊర్లో ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
SDPT: సిద్ధిపేట అర్బన్ పొన్నాల గ్రామపంచాయతీలో ప్రైవేట్ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు బుధవారం ఫీల్డ్ విజిట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలోని కంపోస్ట్ యార్డును సందర్శించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను, వ్యర్థాల విభజన, కంపోస్టింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో అనుభవం చాలా ఉపయోగపడుతుందన్నారు.
HYD: పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ లైన్లను తగ్గించేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీని ప్రకటించింది. వ్యక్తిగత వాహనాల కోసం పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉండకుండా, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. ఈ నిర్ణయం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని, సౌకర్యవంతమైన ప్రయాణం దక్కుతుందన్నారు.
NRML:పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ చట్టంతో పాత పెన్షనర్లకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్కు బుధవారం వారు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసి లింగన్న, ప్రధాన కార్యదర్శి పోత రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
కోనసీమ: వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరమని జిల్లా ఫైర్ ఆఫీసర్ పార్థసారథి అన్నారు. ఈ సంవత్సరం జనవరి నుండి నేటి వరకు 66 అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. కోట్లల్లో నష్టం వాటిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు పలు ఆసుపత్రులు, పరిశ్రమలు తనిఖీలు చేసి, ప్రమాదాలు జరగకుండా పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
VSP: బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీతో ఎటువంటి సంబందం లేదని జనసేన కార్యలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి తన వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించి పదవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరించినట్టు తెలిపింది. పర్యావరణానికి సంబంధించి హైకోర్టులో కొనసాగుతున్న పిల్ నేపథ్యంలో జనసేన నుంచి ఆయన వైదొలిగిన విషయం తెలిసిందే.
VZM: జిల్లా వ్యాప్తంగా మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు, శిక్షకులు తమ ప్రతిపాదనలను ఈ నెల 28లోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు 8074116276, 9491767327 నంబర్లను సంప్రదించాలని కోరారు.
BHPL: జిల్లా కోర్టులో ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్.సాయిత్రిలోక్ నాథ్ సూచించారు. మండల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తులు ఈ లోక్ అదాలత్లో పాల్గొని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ‘రాజీమార్గమే రాజామార్గం’ అని అన్నారు.
SRD: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగినంత నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి భరోసా ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో చాలా బంకులు ‘నో స్టాక్’ బోర్డులతో మూతపడుతున్నాయి. వదంతుల వల్ల పెరిగిన అసాధారణ గిరాకీ, సరఫరాలో జాప్యం కారణంగా ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇన్స్టాలో అడుగుపెట్టారు. ‘anna.konidala’ పేరుతో ఖాతా తెరిచిన కోన్ని నిమిషాల్లోనే 64 వేల మంది ఫాలోవర్స్ రావడం విశేషం. రష్యాకు చెందిన అన్నాలెజినోవాను పవన్ 2013 సెప్టెంబరు 30న వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయాలను పాటిస్తూ తన భర్తతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో SMలో వైరల్ అవుతోంది.
HNK: ఉమ్మడి జిల్లాలో ఆధునిక వాతావరణ పర్యవేక్షణ సదుపాయాల్లో ఉన్న లోటుపాట్లను ఎంపీ కడియం కావ్య లోక్సభలో ప్రస్తావించారు. వరంగల్లో ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ముందస్తు చర్యలు, సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు.
ADB: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని BRS పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై మాట్లాడారు. రైతు రుణమాఫీ, పెన్షన్, ప్రతి మహిళకు నెలకు 2500 చెల్లింపు వంటి పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
WNP: పెబ్బేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న ఖేల్ ఇండియా ఫుట్బాల్ మైదానాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం పరిశీలించారు. మైదానంలో కలెక్టర్ రూ.10 లక్షల తన సొంత నిధులతో కొత్తగా ఏర్పాటు చేయించిన హైమాస్ట్ లైట్లను తనిఖీ చేశారు. త్వరలోనే వీటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని క్రీడా అధికారులను ఆదేశించారు.
SKLM: నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను బుధవారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలను నిర్వహిస్తుందన్నారు.