WGL: మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ముసాయిదా బడ్జెట్ సమావేశం జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయ అంచనాలపై ఈ సందర్భంగా చర్చించారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు.
సత్యసాయి: కదిరి నియోజకవర్గం మోటుకపల్లి ఆర్డీటీ పాఠశాలలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి వల్లనే ఆర్డీటీ FCR లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా పేదలకు అండగా ఉన్న సంస్థకు అండగా నిలిచిన ప్రధాని మోదీ, CM చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ATP: పొన్నూరు ఎమ్మెల్యే, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకు గుంటూరు విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం తరపున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని డోంగర్గావ్ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే మంజూరుతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు ప్రజలకు సౌకర్యాన్ని కల్పించనున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
IPL 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పందించింది. ‘ఈ సీజన్ ఆడబోనని డకెట్ ముందే చెప్పాడు. అతనికి రిప్లేస్మెంట్ కోసం మరో ఆటగాడిని వెతుకుతున్నాం. ఎవరిని తీసుకున్నామో త్వరలోనే చెప్తాం’ అని తెలిపింది. డకెట్ నిర్ణయంపై ఢిల్లీ సానుకూలంగా స్పందించినప్పటికీ.. IPL రూల్స్ ప్రకారం అతనిపై నిషేధం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
SRCL: అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న అన్నారు. తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్ ముందు బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను విచారణ పేరుతో వేధిస్తున్నందుకు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసామన్నారు. దానికి గాను 18 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టారని వాపోయారు. కేసులకు భయపడేది లేదన్నారు.
KNR: కాంగ్రెస్ చేనేత రాష్ట్ర కార్యదర్శిగా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందినకూరపాటి రామచంద్రం నియమకం అయ్యారు. ఈ మేరకు ఆయనకు చేనేత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
NLR: గుడ్లూరు మండలం సాలిపేట-రావూరు మార్గంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చేవూరుకు చెందిన సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఎస్ఐ వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్కూల్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
MDCL: మల్లాపూర్ ప్రాంతంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి HMWSSB ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. నీటి సరఫరాలో తలెత్తుతున్న తక్కువ ప్రెషర్, లీకేజీలు, పైప్లైన్ లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోనున్నారు. కాలనీల వారీగా ప్రత్యేక బృందాలు పర్యటించి ప్రజల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.
BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలోకి గ్యాస్ సిలిండర్లతో వ్యాన్ రాగానే సిలిండర్ల కోసం ప్రజలు భారీగా గుమిగూడి తోపులాటకు దిగారు. ఒక్కసారిగా అందరూ బండి వద్దకు రావడంతో కొంతసేపు గందరగోళం చోటుచేసుకుంది. గ్యాస్ కొరత లేకపోయినా సరఫరా సక్రమంగా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
PDPL: జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆయిల్ ఫామ్ తోటలు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. సాగు వివరాలు తెలుసుకొని, ఆయిల్ ఫామ్ పంట పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పంట సాగు విస్తరణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రమ్య అనే మహిళ ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు.
రిలయన్స్ మీడియా విభాగం జియోస్టార్ సీఈవో పదవికి కిరణ్ మణి రాజీనామ చేశారు. ప్రముఖ AI సంస్థ ఓపెన్ఏఐ నుంచి ఆఫర్ రావడంతో సంస్థను వీడారు. ఆసియా-పసిఫిక్ ఎండీగా జూన్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కిరణ్ మణి రాజీనామాను జియోస్టార్ వైస్ఛైర్మన్ ఉదయ్శంకర్ ధ్రువీకరించారు. ఉద్యోగులకు అంతర్గతంగా ఇ-మెయిల్స్ పంపారు.
AP: ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్మానం చేయనుంది. కొంతకాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతను తెర దించుతూ.. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు పంపిస్తారు.
TG: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన ఘటన HYDలోని జవహర్నగర్లో జరిగింది. తల్లి కనిపించడం లేదని ఏడాది ముందు కూతురు ఫిర్యాదు చేసింది. బైక్, తల్లి మిస్సయిందని కంప్లైంట్ ఇచ్చింది. ఈ క్రమంలో నిన్న బండి విక్రయించేందుకు యువతి ప్రియుడు యత్నించాడు. దీంతో షాప్ నిర్వాహకులు పోలీసులకు సమాచారమివ్వడంతో కూతురు ఇషికా, ప్రియుడు మౌంటీ రాజ్పుత్ను అరెస్ట్ చేశారు.
GNTR: టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కుమార్తె వివాహం బుధవారం గుంటూరులోని శ్రీ కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరై వధూవరులు నాగసాయి వైదీప్తి-కెవిన్ రామ్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.