NRML: మారుమూల గ్రామీణ ప్రాంతాల రూపు రేఖలను మార్చడానికి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందనీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం పెంబి పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని గుమ్మెన, ఎంగులాపూర్, చాకిరేవు, వస్ పల్లి, దొత్తి వాగు, పసుపుల నాయకపు గూడ,కొలంగూడ, హరిచంద్ తండా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.