NLR: రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాలెం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో గత 4 రోజుల్లో మొత్తం 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు.