ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామ బీసీ వాడలో డ్రైనేజీలు అద్వాన్నంగా ఉన్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే డ్రైనేజీలు కంపు కొడుతున్నాయని అన్నారు. మురుగు కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి ఆ నీరు రోడ్డు మీదకు వస్తుందన్నారు. దీంతో కాలనీలో దుర్గంధం వెదజల్లితుందన్నారు. అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించాలని కోరారు.