KRNL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర ఆధ్వర్యంలో బృందావనానికి విశేష పుష్పాభిషేకం, అభిషేక పూజలు చేసి స్వర్ణ కవచాలతో అలంకరించారు. భక్తులు ముందుగా మంచాలమ్మను దర్శించుకుని, మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.