KDP: జానపద సాహిత్య పరిశోధనా శిఖరం ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు అని వివిధ సంఘాల పార్టీ నేతలు కొనియాడారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తంగిరాల సుబ్బారావు సంస్మరణ సభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలిత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.