VSP: వన్ టౌన్ ప్రాంతంలోని 37వ వార్డులోని జంబల్ తోట ప్రాంతంలో గల వరసిద్ధి వినాయక ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఆలయ వార్షికోత్సవ నేపథ్యంలో ఎమ్మెల్యే తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందజేశారు.