BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ భూపాలపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డిని, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు వోసీ-2 ప్రభావిత ప్రాంత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని వినతిపత్రం అందజేశారు. సింగరేణి అభివృద్ధికి సహకరించిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.