VZM: రేగిడి ఆమదాలవలస మండలంలోని కొన్ని RSK కేంద్రాల్లో సాంకేతిక కారణాల వల్ల ధాన్యం కొనుగోళ్లు రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఉణుకూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉణుకూరు, పోరాం, ఒప్పంగి గ్రామాల రైతులు కొనుగోళ్లు అవ్వక పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.