KDP: చెన్నూరు మండల వెలుగు కార్యాలయంలో జాతీయ లింగ సమానత్వంపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, ఏపిఎం వెంకటేష్ హాజరయ్యారు. వారు డోక్రా మహిళలతో మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీ, పురుష మధ్య సమానత్వం ఉండాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.