KRNL: నందికొట్కూరుకు చెందిన సురేంద్రబాబు (ప్రమోద్) బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుమారుడి నేత్రాల ద్వారా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించాలనుకున్న తల్లిదండ్రులు కళ్లు దానం చేసేందుకు అంగీకరించారు.