కడప: జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. జిల్లాలోని కొండాపురం, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో సరస్వతి దేవి విగ్రహాలు, చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులచే అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు వసంత పంచమి పండుగ విశిష్టతను తెలిపారు.