అనంతపురం నగరంలో ఆర్డీటీ సంస్థ రెన్యువల్ అయిన సందర్భంగా బుధవారం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ఆర్డీటీ వ్యవస్థాపకుడు మంచు ఫెర్రర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్డీటీకీ రెన్యువల్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.