VZM: ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లకు యువత బలికావద్దని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ యువతకు బుధవారం పిలుపునిచ్చారు. ఈనెల 28 నుంచి ఐపీల్ మ్యాచ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో బెట్టింగ్లకు గురికావద్దని ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే, బెట్టింగ్ యాప్ల వల్ల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారు.