యాంకర్ శ్రీముఖి కొత్త అవతారమెత్తింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని ఐటీ హబ్ మాదాపూర్లో తన స్నేహితులతో కలిసి ‘ఫుర్సత్’ అనే గ్రాండ్ రెస్టారెంట్ను ప్రారంభించింది. సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని శ్రీముఖి పేర్కొంది.