ELR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. బుధవారం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్ ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తులకు ప్రసూతి, శిశు ఆరోగ్యం, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల స్క్రీనింగ్, అవసరమైన మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.