CTR: కూటమి పాలనలో తిరుపతి ప్రతిష్ట దిగజారుతున్నట్టు మాజీ మంత్రి రోజా ఆరోపించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలలో వైసీపీ నాయకులపై దాడికి పాల్పడటం, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడం దారుణమన్నారు. పోలీసుల సమక్షంలోనే ఇలా జరగడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో? తెలుస్తోందన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.