VZM: చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు సోదరుడు సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేతో మాట్లాడి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.